Ram Charan : ధ్రువ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాయబోతోందా….! తెలుగు లో మళ్ళీ అరవింద స్వామి కనిపిస్తారా….!

Ram Charan: ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదల కాబోతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమా సమస్య ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్,శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ  రామ్ చరణ్ జోడీగా నటిస్తోంది.అంతేకాకుండా వీరితో పాటే హీరోయిన్ అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర ,జయరామ్, తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక కొత్త అప్డేట్ చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ సినిమాలో చరణ్ కి విలన్ గా ఒకప్పటి స్టార్ హీరో అరవిందస్వామి కనిపించబోతున్నాడు అన్నట్లుగా సమాచారం.  అరవింద స్వామి బొంబాయి, రోజా వంటి సినిమాల తో తెలుగు , తమిళ భాషలలో నే కాకుండా ఇతర భాషలలో సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక స్టైలిష్ విలన్ గా ఆకట్టుకుంటున్నాడు.

అంతేకాకుండా నెక్స్ట్ షెడ్యూల్ చరణ్ తో పాటుగా అరవిందస్వామి కూడా జాయిన్ కాబోతున్నాడు అనే వార్త బాగా వైరల్ గా మారుతుంది. ఇదివరకే రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమాలో అరవిందస్వామి విలన్ గా కనిపించారు. అప్పుడు వీరిద్దరి కాంబినేషన్ కూడా బాగా కుదిరింది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ ఆర్ సి15 చిత్రానికి కూడా విలన్గా అరవింద సామెత తీసుకుంటున్నట్టు వార్తలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేయలేదు చిత్రబృందం. ఇక అభిమానులు మాత్రం ఈ సారి కూడా వీరి కాంబినేషన్ లో సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అనుకుంటున్నారు.