ధనుష్ సినిమా.. ఏకంగా మూడు

ప్రస్తుతం సౌత్ లో పాన్ ఇండియా సినిమాలు, పీరియాడిక్ జోనర్, ఫ్రాంచైజ్ ల ట్రెండ్ నడుస్తోంది. బాహుబలితో మొదలైన ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతూ వెళ్తోంది. ఇక చాలా మంది దర్శకులు ఫ్రాంచైజ్ ల మీదనే దృష్టి పెట్టారు. కేజీఎఫ్ సిరీస్ లో పార్ట్ 2 కూడా ఉందని ఇప్పటికే చెప్పారు. అలాగే సలార్ రెండు భాగాలుగా వస్తోంది. లోకేష్ కనగరాజ్ ప్రత్యేకంగా ఓ యూనివర్స్ ఫ్రాంచైజ్ సృష్టించుకున్నాడు.

ఇక ప్రశాంత్ వర్మ కూడా సూపర్ హీరోల ఫ్రాంచైజ్ ని హనుమాన్ తో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తమిళంలో మరో స్టార్ హీరో ఈ ట్రెండ్ లోకి వచ్చేశాడు. తమిళ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సానికాయుధం మూవీతో హిట్ కొట్టిన అర్జున్ మాథేశ్వరన్ దర్శకత్వం కెప్టెన్ మిల్లర్ తెరకెక్కుతోంది. పీరియాడిక్ జోన్ లో రెడీ అవుతోన్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సిద్ధం అవుతోంది.

ఇక ఈ చిత్రంలో కెప్టెన్ మిల్లర్ పాత్రలో ధనుష్ డిఫరెంట్ గా మాసిన గెడ్డంలో కనిపించబోతున్నాడు. దీనిపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా మొన్నటి వరకు ఒక పార్ట్ గానే ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ మూవీని 3 పార్ట్ లు గా తెరకెక్కిస్తున్నారంట.

ఇక మొదటి భాగం బ్రిటిష్ కాలంలో స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. బ్రిటిష్ వారిపై పోరాటం నేపథ్యంలో ఆ కథాంశం ఉంటుందంట. ఇక పార్ట్ 2 1990 బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. అయితే ఈ కథలో ఎలాంటి అంశాలని చూపించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక పార్ట్ 3 ప్రెజెంట్ లో ఉంటుందంట. ఇందులో మొదటి భాగం షూటింగ్ ప్రస్తుతం తెరకెక్కుతోంది.

ఇక 3 భాగాలలో ధనుష్ 3 పాత్రలలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ లో వంద కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మొట్టమొదటి ధనుష్ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో ధనుష్ కి జోడీగా ప్రియాంకా ఆరుళ్ మోహన్ నటిస్తోంది.