శేఖర్‌ కమ్ములతో నాగ్‌, ధనుష్‌ సినిమా!

‘కుబేర’ కోసం దర్శకుడు శేఖర్‌ కమ్ములతో చేతులు కలిపారు కథానాయకులు ధనుష్‌, నాగార్జున. ఈ ముగ్గురి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక.

ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ బ్యాంకాక్‌లో ప్రారంభమైనట్లు చిత్ర బృందం ప్రకటించింది. నాగార్జునతో పాటు మరికొందరు కీలక నటులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా యాక్షన్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించ నున్నారు. మాఫియా నేపథ్యమున్న ఓ ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి.