ధనుష్‌ హీరోగా ..శేఖర్‌ కమ్ముల కొత్త సినిమా!

చాలామంది దర్శకులు అగ్ర నటులతో పనిచేస్తూ, పెద్ద బ్జడెట్‌ సినిమాలు తీస్తూ పేరు తెచ్చుకుంటారు. కానీ చిన్న బడ్జెట్‌ తో సృజనాత్మకమైన సినిమాలు తీసి అగ్ర దర్శకులతో సమానంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎవరైనా వున్నారు అంటే, అది ఒక్క శేఖర్‌ కమ్ముల మాత్రమే. అతను తీసిన ప్రతి సినిమాలోనో ఒక మంచి సందేశం ఉంటుంది, వినోదం ఉంటుంది, అలాగే తెలుగుదనం ఉంటుంది.

తాను రాసుకున్న కథలకి వెండితెర విూద ఒక రూపం కల్పించి, ప్రేక్షకుల మదిలో కలకాలం ఉండేట్టు చిత్రాలు తీయగల దిట్ట శేఖర్‌ కమ్ముల. శేఖర్‌ కమ్ముల ఇప్పుడు తమిళ నటుడు ధనుష్‌తో సినిమా చేస్తున్నారు. దీనికి సునీల్‌ నారంగ్‌, పుష్కర్‌ రామ్‌ మోహన్‌ రావులు నిర్మాతలుగా వున్నారు.

తెలుగు అగ్ర నటుల్లో ఒకరైన నాగార్జున ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ మొదలయ్యింది. ఈమధ్యనే ’యానిమల్‌’ లో నటించి, సంచలనం సృష్టించి నేషనల్‌ క్రష్‌ గా పేరుగాంచిన రష్మిక మందన్న ఇందులో కథానాయిక.

ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలవుతోంది. ఇది దర్శకుడు శేఖర్‌ కమ్ముల కెరీర్‌ లో ఒక మైలురాయి గా నిలబడే సినిమా. ఇంతకు ముందు నిర్మాత సునీల్‌ నారంగ్‌ తో ’లవ్‌ స్టోరీ’ సినిమా చేశారు.

అదే నిర్మాతలతో మళ్ళీ జతకట్టి ఈ ధనుష్‌ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ధనుష్‌ ఆసక్తి చూపిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ’సార్‌’ చేశారు. అది ఆయనకు తొలి తెలుగు సినిమా. నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఇంకో సినిమా అంగీకరించారు. రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా స్టార్ట్‌ చేశారు. ధనుష్‌ విూద కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.