దసరా దర్శకుడి రెండో సినిమా కన్ఫర్మ్

దసరా సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ తోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ చేసి రికార్డులు సృష్టిస్తుంది. నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా దసరా నిలిచింది.

తెలంగాణ నేపధ్యంలో అదిరిపోయే సోషల్ మెసేజ్ ని ఆవిష్కరించాడు అనే ప్రశంసలు సొంతం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం మరో అదిరిపోయే ఛాన్స్ సొంతం చేసుకున్నాడు అని సమాచారం. ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఓదెల అక్కినేని యువ హీరో హీరో అఖిల్ తో సినిమా చేయడానికి రెడీ కాబోతున్నట్లుగా సమాచారం.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం శ్రీకాంత్ ఇప్పటివరకు అఖిల్ కు కథ చెప్పలేదు. అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ఏజెంట్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా మీద అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

దీని తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాకి చర్చలు జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది. ఒకవేళ ఈ సినిమా స్టార్ట్ అయితే మాత్రం కచ్చితంగా ఈ దర్శకుడికి మరో క్రేజీ ఆఫర్ అనే చెప్పాలి. ఇక శ్రీకాంత్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మాత్రమే కాకుండా టాలీవుడ్ లో బడా నిర్మాతలు నుంచి కూడా ఆఫర్స్ వస్తూ ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తూ ఉంది.

మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో కూడా ఒప్పందం చేసుకున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే దసరా సినిమా ఇప్పుడు రికార్డు స్థాయి కలెక్షన్స్ రావడంతో టాలీవుడ్ లో డబ్యూ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ అందుకున్న దర్శకుడిగా శ్రీకాంత్ గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత సుధాకర్ చెరుకూరికి కూడా ఏకంగా 80 లక్షల విలువైన కారుని దర్శకుడు కి బహుమతిగా అందించడం విశేషం.