మహేష్ “గుంటూరు కారం” పై క్రేజీ న్యూస్..!

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రీసెంట్ టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ శ్రీ లీల అలాగే గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఓ పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రమే “గుంటూరు కారం”.

కాగా ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యి అన్నీ సెట్ అయితే ఈ ఆగష్టు లోనే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కానీ పలు కారణాలతో మార్పులు చేర్పులతో అలా వెనక్కి వచ్చింది. కానీ ఈ చిత్రం పట్ల మాత్రం మాత్రం మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఆల్రెడీ పూజా పై చేసిన సీన్స్ స్క్రాప్ చేసినప్పటికీ మిగతా అవుట్ ఫుట్ అంతా కూడా పక్కాగా వచ్చింది అట. అలాగే ఈ సినిమా షూటింగ్ అని పనులని కూడా డిసెంబర్ నాటికి కంప్లీట్ చేసే ప్లానింగ్ లో ఇప్పుడు మేకర్స్ పక్కాగా ఉన్నారట. దీనితో జనవరిలో ఆన్ టైం రిలీజ్ కి సిద్ధంగా ఈ చిత్రం ఉంటుంది అని సినీ వర్గాల నుంచి లేటెస్ట్ సమాచారం.

మొత్తానికి అయితే గుంటూరు కారం విషయంలో మేకర్స్ బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.