ముందు మహేష్ ను ఒప్పిస్తే బెటర్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే గుంటూరు కారం సినిమా ఏ క్షణంలో మొదలుపెట్టారో కానీ ప్రతి షెడ్యూల్లో కూడా ఏదో ఒక ఇబ్బంది అయితే మొదలవుతోంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మ్యూజిక్ విషయంలోనే మహేష్ బాబు అసలు ఏ మాత్రం సంతృప్తిగా లేడు అని తెలుస్తోంది. థమన్ ను తీసేసి మరొకరిని ఫైనల్ చేయాలని ముందుగానే త్రివిక్రమ్ తో కూడా చర్చలు జరిపినట్లు ఆ మధ్య చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి.

కానీ త్రివిక్రమ్ మాత్రం థమన్ ను వదులుకోవడానికి అంతగా ఇష్టపడడం లేదు. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ఇచ్చినప్పటికీ కూడా దాదాపు అవన్నీ రిజెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా మ్యూజిక్ సిటింగ్స్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు అనుకున్న ట్యూన్స్ మొత్తం క్యాన్సిల్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు మొత్తం ఐదు పాటలకు సంబంధించిన ట్యూన్స్ సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే అంతా బాగానే ఉంది కానీ ముందు మహేష్ బాబును ఒప్పించారా లేదా అనే విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇటీవల మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు హాలిడే ట్రిప్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సడన్ గా థమన్ త్రివిక్రమ్ ఇద్దరూ కూడా రోజు ఉదయం ఐదు గంటలు మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మహేష్ బాబు వచ్చిన తర్వాత ఆయన కూడా వీరి సెట్టింగ్స్ లో పాల్గొనే అవకాశం ఉందట. ఏది ఏమైనప్పటికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో త్రివిక్రమ్ మాత్రం మరో ఆలోచన పెట్టుకోలేనట్లుగా తెలుస్తోంది. ఇక మహేష్ మాత్రం థమన్ విషయంలో మరోసారి చర్చలు జరపాల్సి ఉందట. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. మరి ఆ సమయానికి వస్తుందో లేదో చూడాలి.