Kangana Ranaut: సోషల్‌ విూడియాలో మంత్రగత్తెల వ్యాఖ్యలు… మహిళల స్వేచ్ఛా స్ఫూర్తి అంటూ కంగనా కామెంట్స్‌!!

Kangana Ranaut: విలక్షణమైన నటన, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు సోషల్‌ విూడియాలో కంగనా రనౌత్‌ హల్‌ చల్‌ చేస్తుంటారు. ప్రభాస్‌ ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కంగనా బాలీవుడ్‌ చిత్రాలతో, పొలిటికల్‌ కామెంట్స్‌ తో అందరికి పరిచయమే. ప్రస్తుతం ఆమె నటించి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు సంబంధించిన వివాదం నడుస్తుండగా, ఆమె మరో పోస్ట్‌ తో వార్తల్లో నిలిచారు.

మరో వైపు దీనికి స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా మద్దతు తెలిపింది. తాజాగా ఒక సోషల్‌ విూడియా వినియోగదారుడు ’మంత్రగత్తెలకు భయపడవద్దు.. వారిని కాల్చిన వారికి భయపడండి’ అంటూ పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయ్యింది. ఈ పోస్ట్‌ రిప్లైగా కంగనా ఒక పోస్ట్‌ ని కోట్‌ చేసింది. ’మంత్రగత్తెలు తమ ఉన్నత స్వభావానికి, అంతర్‌ దృష్టికి ప్రసిద్ధి. వారు స్వేచ్ఛా స్ఫూర్తితో అనుసంధానించబడిన మహిళలు. లొంగని సంకల్ప శక్తి , హద్దులను ఛేదించాలనే అనియంత్రిత కోరికతో ఉంటారు.

రహస్యంగా భయపడే పంజరంలో ఉన్నవారిని శపించబడిన వారిని బెదిరించే విచ్‌. ప్రతిభావంతులైన వ్యక్తులకు కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయని వారిని బూడిద చేయాలని విశ్వసిస్తారు. దుఖ్ఖము చాలా రూపాల్లో ఉంది. అసూయ అనేది అన్నింటికంటే దయనీయమైనది. విూరు అసూయపడాలని లేదా ప్రేరణ పొందాలని ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.. కానీ తెలివిగా ఎంపిక చేసుకోండి.. ప్రేరణ పొందాలని ఎంచుకునే వారు తదుపరి ఎంపికల్లో విజయం సాధిస్తారు.

పంజరాన్ని విచ్ఛిన్నం చేసి విముక్తి పొందండి. ఇలానే నేనొక మంత్రగత్తె’ అని కంగనా రాసుకొచ్చింది. దీనికి హీరోయిన్‌ సమంత మద్దతు తెలుపుతూ.. తన సోషల్‌ విూడియా అకౌంట్‌ ద్వారా ప్రకటించింది.

ప్రస్తుతం ఆమె నటించి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు సంబంధించిన వివాదం నడుస్తోంది. సెన్సార్‌ పరంగా ఇబ్బందులు నెలకొన్న విషయం తెలిసిందే. సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ముంబై హైకోర్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌ సర్టిఫికేషన్‌ ఇటీవల ఆదేశించింది. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా చిక్కులు తొలగలేదని భావిస్తున్నారు.

Public EXPOSED: Pawan Kalyan and Chandrababu Ruling || AP Public Talk || Ys Jagan || Telugu Rajyam