మెగా అల్లుళ్ల పెళ్లి గోల.. అంతలా హార్టయ్యారా?

sai tej

మెగా ఫ్యామిలీ ఇటీవల ఉదయ్ పూర్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. నిహారిక పెళ్లి వేడుకను డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేయగా మొత్తం 150 మందికి పైగా పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఇక ఆ ఫ్యామిలీలో త్వరలోనే మరొక శుభకార్యం జరగనున్నట్లు టాక్ గట్టిగానే వచ్చింది. అయితే ఆ రూమర్స్ పై సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన క్లారిటీకి మరొక హీరో హార్ట్ అయ్యాడని టాక్ వస్తోంది.

ఇటీవల మెగా డాటర్ నిహారిక పెళ్లి అనంతరం నెక్స్ట్ జరగబోయే పెళ్లి అబ్బాయిదేనని ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ సిద్ధంగా ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక ఆ విషయంపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన సాయి తేజ్ తన పెళ్లి ఇప్పట్లో జరగదని తనకంటే పెద్ద వాడైనా అల్లు శిరీష్ ది జరగవచ్చని చెప్పాడు. అక్కడే విషయం సీరియస్ అయినట్లు రూమర్స్ వస్తున్నాయి.

అల్లు శిరీష్ కూడా సాయి చెప్పిన విషయంపై వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తూ.. సాయి ఎదో జోక గా అని ఉంటాడు. అతని మాటలను మీరు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా క్లారిటీ అయితే ఇచ్చాడు. అలాగే తన పెళ్లి ఎప్పుడు ఆనేది,, ఫిక్స్ అయితే నేనే చెబుతానని కూడా అన్నాడు. ఇక ఇలా ఆన్సర్ ఇవ్వడంతో సాయి ధరమ్ తేజ్ కూడా హార్ట్ అయినట్లు టాక్ వస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే వీలైనంత త్వరగా ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే..