జర జాగ్రత్త.! చిరంజీవి స్వీట్ వార్నింగ్.!

‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వ్యవహారాలు త్వరలో ప్రారంభమవుతాయి. ప్రస్తుతానికి షూటింగ్ సన్నాహాలు జరుగుతున్నాయ్.

కొద్ది రోజుల క్రితం చిరంజీవికి జరిగిన చిన్నపాటి సర్జరీ నేపథ్యంలో ఈ ఆలస్యమన్న చర్చ జరుగుతుండగా, ‘భోళా శంకర్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాలని చిరంజీవి ముందే అనుకున్నారన్నది మరో వాదన.

ఇదిలా వుంటే, బడ్జెట్ విషయంలో ఒకింత జాగ్రత్తగా వుండాలంటూ దర్శకుడు వశిష్టకి మెగాస్టార్ చిరంజీవి తాజాగా సూచించారట. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పనిలేదనీ, అయితే, లిమిటెడ్ బడ్జెట్‌లో క్వాలిటీ ఔట్‌పుట్ విషయమై సరైన ప్లానింగ్‌తో వెళదామని చిరంజీవి సూచించారట.

వాస్తవానికి, చిరంజీవి ప్రతి సినిమాకీ ఇలాగే దర్శకులకు సూచిస్తుంటారనీ, అయితే ‘భోళా శంకర్’ డిజాస్టర్ నేపథ్యంలో ఇంకాస్త ప్రత్యేకంగా ఈ విషయాన్ని దర్శకుడికి సూచించారని అంటున్నారు.

అయినాగానీ, బడ్జెట్‌కి బాగా స్కోప్ వున్న సినిమాయేనట ఇది.!