శర్వానంద్ కూడా కాకపోతే ఇంకెవరు.?

ఓ యంగ్ హీరోతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారట. ఆ యంగ్ హీరో ఎవరో కాదు, ‘డీజె టిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి పేరు కూడా వినిపించింది.

తాజాగా శర్వానంద్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడయితే సిద్దు జొన్నలగడ్డ కాదు, నవీన్ పోలిశెట్టి కాదు, శర్వానంద్ దగ్గరే ఆగింది. ఒకవేళ శర్వా నంద్ కూడా కాకపోతే బెస్ట్ ఆప్షన్ ఎవరు.? అనే విషయమై వెతుకులాట అయితే కొనసాగుతూనే వుందట.

ఈ లిస్టులో చిరంజీవికి వీరాభిమాని అయిన కార్తికేయ పేరు కూడా వినిపిస్తోంది. ‘బెదురులంక’ సినిమాలో ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్నాడు.

ఇదిలా వుంటే, మెగా కాంపౌండ్ హీరో , వైష్ణవ్ తేజ్ పేరు కొత్తగా ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఆ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఏంటా అని ఆరా తీయగా.. ఇదంతా ‘ బ్రో డాడీ’ రీమేక్ కోసమే అంటున్నారు.

కాదు కాదు ఇది రీమేక్ కాదు, ఒరిజినల్ స్ర్కిప్టు అని కూడా అంటున్నారు. ఏది నిజం.? అసలు విషయం తేలాల్సి వుంది.