ఆ విషయంలో చిరంజీవి సీరియస్ డెసిషన్.!

‘భోళా శంకర్’ సినిమా చిరంజీవిలో చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చిందని చెప్పొచ్చేమో. చాలా కాన్ఫిడెంట్‌గా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ కాన్ఫిడెన్స్‌కి ‘భోళా శంకర్’ బ్రేకులు వేసినట్లయ్యింది.

ఇప్పుడు చేయబోయే సినిమాల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారట ఆయన. ఈ క్రమంలోనే గెస్ట్ రోల్స్ చేయకూదన్న డెసిషన్ తీసుకున్నారట.

కొందరు యంగ్ హీరోలూ, తన తోటి సీనియర్ హీరోల సినిమాల్లో చిరంజీవి గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తే ఎలా వుంటుంది.? అనే అభిప్రాయాలు ఈ మధ్య వినిపించాయ్.

అందుకు చిరంజీవి కూడా తనకెలాంటి అభ్యంతరాల్లేవ్.. అన్న సంకేతాలు పంపించారు. కానీ, ఈ లోపే ఆయన డెసిషన్ మార్చేసుకున్నారట. ‘భోళా శంకర్’ సినిమా తర్వాత ఈక్వేషన్స్ అలా మారిపోయాయ్ మరి.

ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి రిస్కులు కూడా చేయడం సబబు కాదని అనుకుంటున్నారట. అంతా బాగానే వుంది కానీ, చిరంజీవి, కళ్యాణ్ క‌ృష్ణతో చేయబోయే సినిమా మల్టీ స్టారర్ మూవీ అన్న సంగతి తెలిసిందే.

ఓ యంగ్ హీరోతో కలిసి చిరంజీవి ఈ సినిమాలో నటించబోతున్నారన్న ప్రచారం కూడా వుంది. తాజా ప్రచారాన్ని బట్టి, ఆ సినిమా అటకెక్కేసినట్లేనా.? ట్రోల్స్ ధాటికి తట్టుకోలేకే చిరంజీవి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ లీకులు వినిపిస్తున్నాయ్. చూడాలి మరి, ఇందులో నిజమెంతో.!