చిరంజీవికి సన్మానం.! వాళ్ళు మాత్రం దూరం.!

‘ఆ పెంట ఇంకోసారి వద్దు..’ అంటూ సినీ పరిశ్రమలో కొందరు చెవులు కొరుక్కుంటున్నార్ట.! అసలు విషయమేంటంటే, పద్మ విభూషణ్ పురస్కారం మెగాస్టార్ చిరంజీవిని వరించింది. గతంలో ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. చిరంజీవిని కొందరు తూలనాడారు, సెటైర్లు వేశారు. చిరంజీవికి జరిగిన సన్మానం.. ఈ క్రమంలో జరిగిన గలాటా.. అందరికీ తెలిసిందే.! ఆ గలాటాకి కారణమెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరిప్పుడు, చిరంజీవికి సన్మానం జరిగితే.. ఆ గలాటా ఇంకోసారి రిపీట్ అవదన్న గ్యారంటీ ఏంటి.? నిర్మాత దిల్ రాజు అయితే, తర్వరాలో సన్మాన కార్యక్రమం.. అని ‘మెగా’ ప్రకటన చేసేశారు.

అంతే, ‘ఆయన్ని మాత్రం పిలవొద్దు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు తేల్చి చెబుతున్నారు. కానీ, పిలవకపోతే బాగోదు కదా.! ‘పిలిచారుగానీ, సెక్యూరిటీ సమస్య వస్తుందనే భయంతో వెళ్ళలేదు..’ అని ఈ మధ్యనే ఓ కార్యక్రమానికి వెళ్ళకుండా ఉండిపోయిన, ఆయన.. ‘మెగా సత్కార వేడుక’కి కూడా దూరంగా వుంటే మంచిదేమో.!

స్వచ్ఛందంగా వాళ్ళే దూరంగా వుంటారా.? వాళ్ళని ఈ వేడుక కోసం నిర్వాహకులు దూరం పెడతారా.? వేచి చూడాలిక.