మెగాస్టార్ లైన్ లోకి శ్రీలీల

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య మూవీ చేస్తున్నారు. వేదాళం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే మెయిన్ స్టొరీ లైన్ మాత్రమే తీసుకొని నేరేషన్ అంతా కూడా మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గ విధంగా మార్చి కమర్షియల్ ఎంటర్టైనర్ గా మెహర్ రమేష్ ఆవిష్కరిస్తున్నాడంట.

ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమాలపై ప్రస్తుతం ఇంటరెస్టింగ్ టాక్ నడుస్తోంది. వాల్తేర్ వీరయ్య మూవీ సమయంలోనే తన పెద్ద కూతురు సుస్మిత ప్రొడక్షన్ లో ఒక మూవీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు దానినే సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారంట. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ మెగాస్టార్ కి స్టొరీ నేరేషన్ కూడా ఇచ్చేసారని సమాచారం. ఇక ఈ సినిమాలో మరో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అతనికి జోడీగా సెన్సేషన్ బ్యూటీ శ్రీలీలని ఎంపిక చేసారని టాక్. అయితే ఆమె ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదంట.

ఇక ఈ మూవీ తర్వాత బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మూవీ చేయనున్నారని సమాచారం. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. సోషియో ఫాంటసీ కథాంశంతోనే ఈ చిత్రాన్ని వశిష్ట మల్లిడి ఆవిష్కరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మెగాస్టార్ బ్యాక్ టూ బ్యాక్ ఇద్దరు యువ దర్శకులతో రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలని లైన్ లో పెట్టడం విశేషం.

మరి వీటిపై అధికారికంగా ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుందనేది చూడాలి. భోళా శంకర్ ఆగష్టు 11న రిలీజ్ కానుంది. దీని తర్వాత ఈ రెండు చిత్రాలు స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందంట. వీటిలో ముందుగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో సినిమాని చిరంజీవి స్టార్ట్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.