చిరంజీవి కొత్త ప్రయోగం.!

‘ఆచార్య’ డిజాస్టర్ ఇంకా చిరంజీవిని వెంటాడుతూనే వుంది. మధ్యలో ‘వాల్తేర్ వీరయ్య’ కాస్త రిలాక్స్‌నిచ్చినప్పటికీ, తాజా సినిమా ‘భోళా శంకర్’‌తో మరోసారి డిజాస్టర్ రిపీట్ అయ్యింది చిరంజీవికి. దీంతో చిరంజీవి డైలమాలో పడ్డారట. ప్రస్తుతం చేయాల్సిన ప్రాజెక్టుల్ని కాస్త హోల్డ్‌లో వుంచి పునరాలోచన చేయాలనుకుంటున్నారట మెగాస్టార్ చిరంజీవి.

కథల ఎంపికలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నారట. ఆల్రెడీ కమిట్ అయిన కథల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని అనుకుంటున్నారట. అందుకోసం స్పెషల్ టీమ్‌ని సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఓకే చేసిన కథల్లో మార్పుల ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందనీ ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ‘ఆచార్య’ సినిమాని పూర్తిగా కొరటాల శివకే వదిలేశారు చిరంజీవి.

ఆ కారణంగానే ఆ సినిమా ఫెయిలైందన్న ప్రచారం వుంది. అయితే, ‘భోళా శంకర్’ విషయంలో అలా జరగలేదు. అన్నీ దగ్గరుండి చాలా జాగ్రత్తగా బాధ్యతగా చూసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మంచి కంటెంట్ వున్న కథ. ఆల్రెడీ వేరే భాషలో హిట్ అయ్యింది. ఇలాంటి కథని తెలుగులోకి తీసుకొస్తే తప్పేంటీ.? అనే సదుద్దేశ్యంతోనే ఈ సినిమా టేకప్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆలోచన బెడిసికొట్టింది. టైమ్ బ్యాడ్ అనుకోవాలేమో.

దీంతో చిరంజీవి అప్డేట్ అవ్వాలని ఆయనకు అత్యంత సన్నిహితులతో సహా, మెగా కాంపౌండ్ కూడా చిరు సూచనలిస్తోందట. ఆ సూచనలను చిరంజీవి ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారనీ తెలుస్తోంది. అందులో భాగంగానే తన టీమ్ పాట్నర్స్ అందరినీ మార్చేయబోతున్నారట చిరంజీవి. అందులో ఆర్టిస్టులతో పాటూ, టెక్నీషియన్లు కూడా వుండబోతున్నారట. సరికొత్త టీమ్‌తో సరికొత్త కథలతో పూర్తి అప్‌డేట్ వెర్షన్‌తో చిరంజీవి ఇకపై రానున్నారనీ తెలుస్తోంది.