మార్చి 1న వస్తోన్న ‘చారి 111’

‘వెన్నెల’ కిశోర్‌ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్‌ కథానాయికగా, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ కీర్తీకుమార్‌ దర్శకత్వంలో అదితీ సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలవుతోంది. అదితీ సోనీ మాట్లాడుతూ.. నిర్మాతగా ‘చారి 111’ నా తొలి సినిమా. వైవిధ్యమైన కథతో తీసిన మంచి వినోదాత్మక చిత్రమిది. వెన్నెల కిశోర్‌ కామెడీని ప్రతి ఒక్కరు ఎంజాయ్‌ చేస్తారు’ అన్నారు.

‘మళ్ళీ మొదలైంది’ సినిమా తర్వాత నేను చేసిన ద్వితీయ చిత్రం ‘చారి 111’. ఇదొక స్పై యాక్షన్‌ కామెడీ జానర్‌ ఫిల్మ్‌ అన్నారు టీజీ కీర్తీకుమార్‌. ఈ సినిమాలో ఒక్కటే పాట ఉంది. ఈ పాటని అద్భుతంగా రాయడానికి మూడు నెలల సమయం తీసుకున్నానని అన్నారు రామజోగయ్య శాస్త్రి. తెలుగులో నాకు తొలి చాన్స్‌ ఇచ్చిన యూనిట్‌కి థ్యాంక్స్‌ అన్నారు సంయుక్తా విశ్వనాథన్‌. ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించడం హ్యాపీగా ఉందని అన్నారు సైమన్‌ కె. కింగ్‌.