బాలయ్యకి పెగ్గు పోసి, ‘మూడు’ కొట్టేసిందట.!

నందమూరి బాలకృష్ణతో కలిసి పెగ్గేసిందట మలయాళ భామ హనీ రోజ్. ‘వీర సింహా రెడ్డి’ సక్సెస్ పార్టీ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందిట. ఒకరి చేతిలోని గ్లాసు ఇంకొకరితో తాగించుకుంటున్న వైనం ఫొటోల రూపంలో దర్శనమిస్తోంది కూడా.

అబ్బే, అది లిక్కరు కాదు.. అని రేప్పొద్దున్న హనీ రోజ్ చెప్పినా చెప్పొచ్చు. బాలయ్య మాత్రం, ‘మందేశాం..’ అని చెప్పినా చెబుతాడు. సరే, అది వారి వ్యక్తిగత వ్యవహారం. జస్ట్ సాధారణ డ్రింక్ కూడా అయి వుండొచ్చు.

అసలు విషయం వేరే వుంది. బాలయ్యకు రిపీట్ మోడ్ అంటే ఇష్టం.. హీరోయిన్ల విషయంలో. సోనాల్ చౌహన్, రాధికా ఆప్టే తదితరుల్ని అలాగే రిపీట్ చేశాడు బాలయ్య.

హనీ రోజ్‌ని కూడా రానున్న మరో రెండు సినిమాలకు హీరోయిన్‌గా బాలయ్య ఖరారు చేసేశాడట. అందులో ఒకటి అనిల్ రావిపూడి సినిమా అంటున్నారు. అందుకే మరి, పెగ్గు పోసి.. మూడు కొట్టేసిందంటున్నారు. ఇంతకీ, కొత్తగా చేయబోయే సినిమాల్లో మూడో నెంబర్ ఏ సినిమాకబ్బా.? అదింకా డిసైడ్ అవ్వాల్సి వుందట.