స‌ముద్రంలో డైవ్ చేసిన స‌మంత‌.. న‌మ్మ‌లేక‌పోతున్నా అని అఖిల్ కామెంట్

క‌రోనా కాస్త రిలాక్సేష‌న్ ఇవ్వ‌డంతో అందాల భామ‌లు మాల్దీవుల‌లో రెచ్చిపోతున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హ‌నీమూన్‌లో భాగంగా త‌న భ‌ర్త‌తో మాల్దీవుల‌కి వెళ్ల‌గా, నీలి రంగు స‌ముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ అక్క‌డికి సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేస్తూ వ‌చ్చారు. ఇక ప్ర‌ణీత, దిశా ప‌టానీ, తారా సుత‌రియా ఇలా ప‌లువురు భామ‌లు కూడా మాల్దీవుల‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్కూబా డైవ్ చేస్తూ నెటిజ‌న్స్ నోరెళ్ళ‌పెట్టేలా చేస్తున్నారు.

ఇక అక్కినేని కోడ‌లు స‌మంత కూడా త‌న భ‌ర్త నాగ చైత‌న్య‌తో మాల్దీవుల‌కి చెక్కేసింది. చైతూ 34వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రు మాల్దీవుల‌కి వెళ్ల‌గా అక్క‌డ పుట్టిన రోజుని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోనున్నారు. ఇప్ప‌టికే అక్క‌డి ప్రాంతాల‌కి సంబంధించిన ఫొటోల‌ని సామ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా ఓ ఫోటోలో స్కూబ్ డైవ్ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. మొత్తానికి సాధించా, సముద్రంలో డైవ్ చేశా అంటూ స‌మంత క్యాప్ష‌న్ ఇవ్వ‌గా దానికి అఖిల్ కూడా స్పందించాడు. నిజంగా షాకింగే, నేను న‌మ్మ‌లేక‌పోతున్నా అని కామెంట్ ఇచ్చాడు.

దాదాపు ఏడాదికి ఒక‌సారి త‌న భ‌ర్త‌తో మాల్దీవులు చుట్టొచ్చే స‌మంత ఈ సారి క‌రోనా వ‌ల‌న కొంత టైం తీసుకుంది. మాల్దీవుల‌లో తాము చేసే హంగామాకి సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇవ్వ‌నున్న స‌మంత నెటిజ‌న్స్ ని ఫుల్ థ్రిల్ చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కెరీర్ విష‌యానికి వ‌స్తే స‌మంత ఈ ఏడాది జాను చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. త్వ‌ర‌లో నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నుంది. ఇందులో చైతూ, స‌మంత క‌లిసి న‌టించ‌నున్నారు. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లోను న‌టిస్తునన్న స‌మంత ఆహా కోసం హోస్ట్‌గా మారింది. సామ్ జామ్ అనే షో చేస్తుంది. ఇక చైతూ విష‌యానికి వ‌స్తే ల‌వ్ స్టోరీ, థ్యాంక్యూ అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు