Naga Chaitanya : చైతూను విలన్ ని చేస్తున్న విక్రమ్ కుమార్.. ఆ వెబ్ సిరీస్ కోసమేనా?

Naga Chaitanya :నాగచైతన్య అక్కినేని వారసుడి గా ఫిల్మ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి జోష్ తో పర్వాలేదనిపించినా తర్వాత సామ్ తో కలిసి నటించినా ఏ మాయ చేసావేతో మంచి హిట్ కొట్టాడు. హీరోగా నిలదొక్కుకునే క్రమంలో కొన్ని హిట్లు కొన్ని ప్లాపులు చవి చూసాడు.ఇక విడాకుల తర్వాత తన తండ్రి తో కలిసి తీసిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలయి మంచి విజయం సాధించింది. ఇక ఏడాది ప్రారంభంలోనే బంపర్ హిట్ అందుకున్న చైతూ ఇపుడు వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. మనం, 24 వంటి చిత్రాలు తీసిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు.అమెజాన్ ప్రైమ్ నిర్మించబోతున్న ఈ హార్రర్ థ్రిల్లర్ కోసం నాగచైతన్య సిద్ధమవుతున్నాడు.ఇక ఈ వెబ్ సిరీస్ కోసం ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసారు డైరెక్టర్. పార్వతి మీనన్, ప్రియా భవాని శంకర్ కీలక పాత్రాల్లో నటించబోతున్నారు.

ఈ వెబ్ సిరీస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇపుడు అక్కినేని అభిమానులను థ్రిల్ చేస్తోంది. అదేంటంటే చైతూ ఈ వెబ్ సిరీస్ లో నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు. మొదటిసారి విలన్ గా నటించబోతున్నాడని తెలుస్తోంది. దీంతో అక్కినేని అభిమానుల్లో ఒకింత ఆశ్చర్యం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇయర్ ఎండ్ కు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానున్న దూత వెబ్ సిరీస్ లో నాగ చైతన్య నెగెటివ్ రోల్ చేస్తున్నాడు.

ఆగస్ట్ 11న ఆమిర్ ఖాన్,నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన లాల్ సింగ్ చెద్దా రిలీజ్ అవుతోంది.ఈ ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది.ఆమిర్ ఖాన్ మూవీ కావడంతో లాల్ సింగ్ చెద్దాతో నార్త్ లో తనకు కూడా మంచి గుర్తింపు వస్తుందని నాగ చైతన్య ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు.అందుకే ఏడాది చివర్లో అమెజాన్ ప్రైమ్ లో దూతను రిలీజ్ చేసి నార్త్ లోనూ తన మార్కెట్ ను విస్తరించాలనుకుంటున్నాడు.చూడాలి ఈ అక్కినేని చిన్నోదిచిన్నోడి ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో.