‘పిండం’ సినిమాకు సెన్సార్ హెచ్చరిక!

‘ఒకరికి ఒకరు’ ఫేమ్‌ శ్రీరామ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌’ అనేది ఉప శీర్షిక. కుశీ రవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. సాయికిరణ్‌ దైదా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌తో పాటు టీజర్‌, ట్రైలర్‌లు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కంప్లీట్‌ చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ మూవీకి ’ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్‌ విూడియా వేదికగా వెల్లడిస్తూ.. ఈ సినిమాను గర్భిణీ స్త్రీలు చూడవద్దని సెన్సార్‌ బోర్డు హెచ్చరిక జారీచేసినట్లు తెలిపింది.