సమంత చేసిన పని చేయలేను: కృతి శెట్టి

టాలీవుడ్ ఉప్పెన మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి. ఈ అమ్మడు ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్న ఇప్పుడు వరుస పరాజయాలతో కెరియర్ లో వెనుకబడిపోయింది. తాజాగా నాగ చైతన్యకి జోడీగా కస్టడీ మూవీలో నటిచింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. డివైడ్ టాక్ తోనే నడుస్తోంది.

ఇదిలా ఉంటే కస్టడీ మూవీ ప్రమోషన్స్ లో కృతి శెట్టి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా ఐటెమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సాంగ్ రికార్డు స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ అయ్యింది. అయితే ఇలాంటి ఐటెమ్ సాంగ్ లో అవకాశం వస్తే చేస్తారా అని ఇంటర్వ్యూలో కృతి శెట్టికి ప్రశ్న ఎదురైంది.

అయితే ఊ అంటావా సాంగ్ లో సమంత చేసినట్లు నేను చేయలేనని క్లారిటీ ఇచ్చింది. తనకి అలాంటి పాటలపై పెద్దగా అవగాహన లేదని, అందుకే చేయలేనని చెప్పుకొచ్చింది. తనకి కంఫర్ట్ లేకపోతే ఎలాంటి పాత్ర అయిన చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంది. తనకి తెలిసిన విషయం ఏంటంటే సౌకర్యంగా లేని పాత్రలు చేయకపోవడం బెటర్. అదే ఎప్పటికి ఫాలో అవుతూ ఉంటారు.

శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నానితో కలిసి కొన్ని సన్నివేశాలలో చేయడానికి ఇబ్బంది పడ్డానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఊ అంటావా సాంగ్ లో సమంత అద్భుతంగా డాన్స్ చేయడంతో పాటు పెర్ఫార్మ్ చేసిందని కృతి శెట్టి ప్రశంసలు కురిపించడం విశేషం. మొత్తానికి ఐటెం సాంగ్, బోల్డ్ పెర్ఫార్మెన్స్ విషయంలో కృతి శెట్టి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేయడం విశేషం.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఒక మూవీలో నటిస్తూ ఉండగా మలయాళంలో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. కస్టడీ తర్వాత తెలుగులో ఇప్పటి వరకు ఇంకో సినిమాకి కమిట్ కాలేదు. అయితే వరుసగా ఫ్లాప్స్ పడుతూ ఉండటంతో కృతిశెట్టిని పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది.