Mahesh Babu : మహేష్ బాబుతో ఎప్పటికైనా సినిమా చేయాలని ఉంది.. అని మనసులో మాట బయట పెట్టిన మాస్ డైరెక్టర్..!

Mahesh Babu : వరుస హిట్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తుండగా, కీర్తి సురేష్ మహేష్ సరసన మొదటిసారి హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్, ఇంకా జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. మొదటగా విడుదలైన కళావతి పాట యూ ట్యూబ్ లో రికార్డులను సృష్టించింది. తర్వాత వచ్చిన పెన్ని పాట కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించారు .

అయితే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. అయితే మహేష్ బాబు అభిమానులు అంతా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుదెప్పుడు సెట్స్ పైకి వెళుతుందని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక స్టార్ డైరెక్టర్ తనకు మహేష్ బాబు అంటే ఎంతో అభిమానం అని, మహేష్ బాబుతో ఎప్పటికైనా సినిమా తీస్తాను అని చెప్పాడట.అయన ఎవరో కాదు బాలకృష్ణ మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శీను.దీంతో మహేష్ లాంటి క్లాస్ హీరోకు బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ పడితే ఆ సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.