బాక్సాఫీస్ రిపోర్ట్ : “వాల్తేరు వీరయ్య” 5 రోజుల కలెక్షన్ డీటెయిల్స్.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ కూడా మరో గెస్ట్ రోల్ లో శృతి హాసన్ మరియు హీరోయిన్ క్యాథెరిన్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో రన్ ని కంప్లీట్ చేసుకుంది.

మరి ఈ చిత్రం అయితే రిలీజ్ అయ్యి మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఇక ఇప్పుడు 5 రోజుల్లో భారీ మొత్తంలో వసూళ్లు నమోదు చేసినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి ఈ చిత్రం 5 రోజులకి గాను ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల మేర గ్రాస్ ని అందుకోగా ఈ 5 రోజుల్లో దగ్గర దగ్గరగా 85 కోట్ల షేర్ ని టచ్ చేసిందట.

ఇక దీనితో ఈ చిత్రం ఆల్ మోస్ట్ బ్రేకీవెన్ దగ్గరకి వచ్చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈరోజు కూడా తెలుగు స్టేట్స్ లో మంచి హోల్డ్ తో  ఈరోజు కూడా మంచి వసూళ్లు టచ్ చేస్తుందని తెలుస్తుంది. దాదాపు ఈ రెండు రోజుల్లో వాల్తేరు వీరయ్య చిత్రం టార్గెట్ రీచ్ అయ్యి భారీ లాభాలు కూడా ఇస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సినిమా కేవలం ఏపీ తెలంగాణ నుంచే 100 కోట్ల గ్రాస్ ని కూడా టచ్ చేయబోతుందట. ఇలా మొత్తానికి వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ ర్యాంపేజ్ ని సెట్ చేస్తుంది. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కించగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహించారు.