షాకింగ్ : “వీరసింహా రెడ్డి” మొదటి రోజు వసూళ్లు బోగస్..?

1328546-veera-simha-reddy-movie

లేటెస్ట్ గా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు నడుమ వచ్చిన చిత్రాల్లో నందమూరి నటసింహం బాలయ్య నటించిన చిత్రం వీరసింహా రెడ్డి కూడా ఒకటి కాగా ఈ సినిమా సంక్రాంహి కానుకగా రిలీజ్ అయ్యి బాలయ్య కెరీర్ లోనె ఓ భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచి దుమ్ము లేపింది.

మొదటి రోజుకే ఏకంగా 50 కోట్లకి పైగా గ్రాస్ ని ఇది అందుకోగా అయితే ఈ వసూళ్లపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరసింహా రెడ్డి బుకింగ్ నిజంగానే నమోదు అయ్యాయి కానీ సీన్ కట్ చేస్తే చాలా థియేటర్స్ లో జనమే కనిపించలేదు అట.

ఇది కేవలం ఏపీ లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా జరిగిందట. మొదటి రోజుకే భారీ ఎత్తున అభిమానులు ప్రతిష్టాత్మకంగా టికెట్స్ అయితే బుక్ చేయగా షో టైం లో మాత్రం కొన్ని ఏరియాల్లో థియేటర్లు ఖాళీ గానే ఉన్నాయట. యూఎస్ లో కొన్ని స్క్రీన్ లు అలాగే ఏపీలో ఉత్తరాంధ్ర కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కావడం గమనార్హం.

దీనితో జస్ట్ ప్రిస్టేజ్ కోసమే ఈ వసూళ్లు డే 1 నాడు నమోదు అయ్యాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే మొదటి రోజు ఇంత మొత్తం వసూళ్లు నమోదు అయితే రెండో రోజుకి గాను యూఎస్ లో వీరసింహా రెడ్డి భారీ డ్రాప్ ని చూసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 60 శాతానికి పైగానే రెండో రోజుకి వీరసింహా రెడ్డి వసూళ్లు తగ్గాయట.

ఈ రకంగా అయితే వీరసింహా రెడ్డి కి మొదటి రోజు వసూళ్లు ఇంత స్థాయిలో నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. అయితే ఆల్రెడీ యూఎస్ లో ఈ సినిమాని అక్కడ ఫ్యాన్స్ చాలా ప్రిస్టేజియస్ గా తీసుకొని రిలీజ్ చేసుకున్నారు ఇది కూడా ఓ కారణం అని చెప్పొచ్చు.