లవ్‌ట్రాక్‌లో పడ్డ అడవిశేష్‌…!!

టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌ డైనమిక్‌ హీరోల్లో ఒకరు అడివిశేష్‌. క్షణం, గూడఛారి, మేజర్‌, హిట్‌ 2 సినిమాలతో హీరోగా తనకంటూ సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రేజీ హీరో కాంపౌండ్‌ నుంచి ఇప్పటికే గూఢచారి 2 వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అడివిశేష్‌ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన ఒకటి బయటకు వచ్చింది. ఈ సారి లవ్‌ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రేమ.. దాని వెనకున్న యూనిక్‌ స్టోరీని విూ ముందుకు తీసుకొచ్చేందుకు అడివిశేష్‌, శృతిహాసన్‌ కలిసి వస్తున్నారు.. నయా సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. ఆసియన్‌ సునీల్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి చాలా కాలం తర్వాత అడివిశేష్‌ నుంచి లవ్‌ ట్రాక్‌ రాబోతుండటంతో అంతా ఆసక్తి నెలకొంది. ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైనట్లు తెలియజేస్తూ అడివి శేష్‌.. ‘జీ2’ నుంచి ప్రీ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

ఈ సీక్వెల్‌ను పీపుల్స్‌ విూడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శేష్‌ ఎక్స్‌ శృతి అంటూ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్‌ వదిలారు. శృతిహాసన్‌ ఆ మధ్య లవ్‌ అంటూ.. సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది. ఆమె ప్రేమాయణంలో కాస్త గందరగోళం నెలకొనడంతో తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

రీ ఎంట్రీలో ఆమెకు మంచి హిట్స్‌ కూడా పడ్డాయి. ’వాల్తేరు వీరయ్య’, ’వీరసింహారెడ్డి’ సినిమాలతో హిట్స్‌ అందుకున్న శృతిహాసన్‌ రీసెంట్‌గా వచ్చిన ’హాయ్‌ నాన్న’ సినిమాలోనూ మెరిసింది. ఇప్పుడు ప్రభాస్‌ సరసన ‘సలార్‌’తో సంచలనానికి సిద్ధమవుతోంది. రీ ఎంట్రీలో స్టార్‌ హీరోలకే ఇంపార్టెన్స్‌ ఇచ్చిన శృతి.. ఇప్పుడు యంగ్‌ హీరో శేష్‌తో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమైంది.

ప్రస్తుతానికి మేకర్స్‌ ఈ వివరాలను మాత్రమే రివీల్‌ చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అడివి శేష్‌ ఇప్పటి వరకు సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌తో అలరిస్తూ వస్తున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ చూస్తుంటే.. ఇదొక లవ్‌ స్టోరీ అని తెలుస్తుంది. ఈ లవ్‌ స్టోరీతో శేష్‌ ఎలా మెప్పిస్తాడో చూడాల్సి ఉంది. ఈ సినిమా విషయమై శేష్‌.. శృతిహాసన్‌తో ఉన్న ఫొటోలను షేర్‌ చేసి తన ఆనందాన్ని తెలియజేశాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్నాయి.