“భోళా శంకర్” పై ఫేక్ హైప్.??

మెగా ఫ్యాన్స్ అయితే ఇపుడు టాలీవుడ్ లో మళ్ళీ గడ్డు కాలం స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి. గత ఏప్రిల్ లో అయితే హీరో సాయి ధరమ్ తేజ్ అందుకున్న హిట్ చిత్రం “విరూపాక్ష”. కాగా ఈ చిత్రం తర్వాత అయితే పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ్ లు కలిసి నటించిన రీమేక్ అండ్ మల్టీ స్టారర్ చిత్రమే “బ్రో”.

మరి ఈ చిత్రం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ రన్ కి వచ్చేసిన సూచనలు కూడా కనిపిస్తుండగా సోమవారం వసూళ్లతో అంతా డిసైడ్ అయిపోయారు. ఇక దీని తర్వాత రాబోతున్న నెక్స్ట్ రీమేక్ చిత్రమే “భోళా శంకర్” కాగా ఈ చిత్రం విషయంలో ఇప్పుడు ఉన్న మెగా ఫ్యాన్స్ లో కూడా సగం హైప్ కూడా కనిపించడం లేదు.

పైగా ట్రైలర్ వచ్చాక ఉన్న ఆసక్తి గాని పాజిటివ్ బజ్ కానీ పోయింది. అయినా కూడా మేకర్స్ మాత్రం తాము చేసింది ఓ కళాఖండం అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ లు చేస్తున్నారు కానీ ఈ సినిమా విషయంలో మాత్రం రియల్ హైప్ ఎక్కడా కనిపించడం లేదు.

పైగా ఈ సినిమాకి ఇప్పుడు బుక్ మై షో లో లక్ష మందికి పైగా ఇంట్రెస్ట్ లు రిజిస్టర్ చేశారు అని సడెన్ గా కూడా చెప్పడం ఈ సినిమాకి ఫేక్ హైప్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. ఇన్ని రోజులు కనీసం బుక్ మై షో ట్రెండింగ్ లో కూడా లేని ఈ చిత్రం పట్ల ఆడియెన్స్ సడెన్ గా ఆసక్తి చూపిస్తున్నారు అంటే అది నమ్మశక్యంగా లేదు.

మరి ఈ సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ వీకెండ్ తో అయితే దీని భవిష్యత్తు ఏంటో కూడా తేలిపోతుంది. ఇక ఇది తెలియాలి అంటే ఈ ఆగస్ట్ 11 వరకు ఆగాల్సిందే.