ఇన్సైడ్ టాక్ : ‘భోళా’ నిర్మాత ఎవరినీ వదిలేది లేదట?

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చి భారీ డిజాస్టర్ గా మిగిలిపోయిన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం “భోళా శంకర్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం డెఫినెట్ గా భారీ నష్టాలు మిగిల్చే డిజాస్టర్ కంటెంట్ ఉన్న సినిమా కాదు ఎంత రీమేక్..

అలాగే మెహర్ రమేష్ మార్క్ ఉన్నా కూడా ఈ చిత్రం ఈజీగా ఆడాల్సిన సినిమా అందుకే మేకర్స్ కూడా ముందు నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. కానీ సినిమా ఎక్కడ దెబ్బ కొట్టింది అంటే ఓ వర్గం ఆడియెన్స్ సినిమాపై కావాలని చేసిన నెగిటివ్ పబ్లిసిటీ వల్ల రావాల్సిన నష్టం కన్నా ఇంకా ఎక్కువ నష్టం వచ్చింది.

పైగా అక్కడ నుంచి ఎన్నో వార్తలు కూడా చిరు అలాగే సినిమా నిర్మాత అనిల్ సుంకర పై కూడా వైరల్ అయ్యాయి. కానీ వాటిలో నిజం లేదు అని మెగా కాంపౌండ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. వీటితో పాటుగా లేటెస్ట్ గా నిర్మాత అనీల్ సుంకర వాట్సాప్ చాట్ కూడా ఒకటి వైరల్ అవుతుండగా తాను కూడా ఆ వార్తల్లో నిజం లేదు అని తేల్చి పెట్టేసారు.

అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత చేసిన నెగిటివ్ పబ్లిసిటీ విషయంలో నిర్మాత ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. యూఎస్ లో ఇంకా షో కంప్లీట్ కాకుండానే సినిమా రిజల్ట్ ఇది అంటూ కొన్ని వెబ్ మీడియాలు ప్రచారం చేయడం పైగా రిలీజ్ అయ్యాక మరింత స్థాయిలో నెగిటివిటీ తీసుకురావడం పెద్ద దెబ్బ అయ్యింది.

ఇక వీటితో పాటుగా చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ప్రచారం కూడా భోళా రిజల్ట్ కి భారీ దెబ్బ వేసింది. దీనితో ఎవరెవరు ఏం చేసారో కొన్ని కీలక ఆధారాలతో అయితే అనిల్ సుంకర కేసు ఫైల్ చేస్తారు అని కొన్ని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. తాను ఎవరినీ వదలబోరు అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో అయితే నెగిటివ్ ప్రచారం చేసే వారి పట్ల తాను మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పాలి.