ఓటిటి : నేటి నుంచే “భోళా శంకర్” దర్శనం..!

ఈ ఏడాది ఓ మెగా హిట్ తో టాలీవుడ్ కి సెన్సేషనల్ వెల్కమ్ ని అందించిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనంతరం వచ్చిన రెండో రిలీజ్ చిత్రమే “భోళా శంకర్”. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించగా తమన్నా హీరోయిన్ గా నటించింది.

అలాగే కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి భారీ నెగటివ్ ఉంది. మెయిన్ గా రీమేక్ సినిమా కావడం దీనికి మించి దర్శకుడు మెహర్ రమేష్ ఎఫెక్ట్ తో సినిమా విషయంలో చాలా మంది ఆసక్తి చూపించలేదు. దీనితో గత అక్టోబర్ లో ఓ పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది అనే విషయం కూడా చాలా మంది మర్చిపోయారు.

మరి ఆ రేంజ్ డిజాస్టర్ అయ్యిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లో అయితే దర్శనానికి వచ్చింది. కాగా ఈ చిత్రం ఓటిటి హక్కులు ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందులో ఈ సినిమా ఈరోజు నుంచి తెలుగు, సహా తమిళ్ కన్నడ మలయాళ మరియు హిందీ భాషల్లో అయితే అందుబాటులోకి వచ్చేసింది.

దీనితో అప్పుడు చూడని వారు అంతా కూడా ఇప్పుడు చూడడం స్టార్ట్ చేశారు. కాగా ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా ఏజెంట్ నిర్మాత అనీల్ సుంకర నిర్మాణం వహించి మరోసారి భారీ నష్టాలు చూసారు.