భోళా శంకర్.. బడ్జెట్ సేవింగ్స్ కోసం ఇలా..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ మూవీకి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు ఈ భోళా శంకర్ తో మరో హిట్ అందుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మూవీ విడుదలకు దగ్గరపడుతుండటంతో, పాటలు విడుదల చేస్తూ, హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా, అది కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది.

కాగా, ఈ మూవీలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి మెగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం చిరంజీవి కనీసం రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట. అలా అని ఫ్రీగా చేయలేదు. మూవీకి వచ్చిన లాభాల్లో లాభాల్లో వాటా తీసుకుంటానని ఆయన చెప్పారట.

మూవీ బడ్జెట్ భారీగా పెరగకుండా ఉండేందుకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మామూలుగా చిరూ మూవీ అంటే భారీ కాస్టింగ్ ఉంటుంది. కానీ, ఈ మూవీలో మొయిన్ క్యారెక్టర్లు మినహాయించి, మిగిలిన పాత్రలకు మొత్తం చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను తీసుకున్నారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, శ్రీముఖి, రష్మి, బిత్తిరి సత్తి,లోబో, అనీ మాస్టర్, జబర్దస్త్ నరేష్ లాంటి వారిని తీసుకున్నారు. వీరి రెమ్యూనరేషన్ లు తక్కువగా ఉండటంతో పెద్దగా బడ్జెట్ పెరగలేదు.

మరి ఎంతో జాగ్రత్తగా, ఎక్కువ హంగులకు పోకుండా, తీసిన ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక, ఈ మూవీ వేదాళం రీమేక్ అనే విషయం తెలిసిందే.. అయితే, సీన్ టూ సీన్ మాత్రం కాపీ చేసినట్లు ఉండదట.త లెుగు నేటివిటీకి తగినట్లు మార్చినట్లు ఇప్పటికే తమన్నా చెప్పింది. ఇదిలా ఉండగా, ఈ మూవీ ని ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో సాగనుంది. కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లిగా కనిపించనుంది.