“వీరసింహా రెడ్డి” – ఏపీలో బాలయ్యకి 5 రూపాయలు లాస్.!

veera-simha-reddy-gets-u-a-censor-certificate

ఇక ఈరోజు తో అయితే టాలీవుడ్ సహా సౌత్ ఇండియా సినిమా దగ్గర సంక్రాంతి సినిమా సందడి మొదలైపోయింది. ఆల్రెడీ తమిళ్ లో స్టార్ హీరోలు అజిత్, విజయ్ ల సినిమాలు రిలీజ్ కాగా తెలుగు లో అజిత్ సినిమా వచ్చేసింది. ఇక మన తెలుగు నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇద్దరు మాస్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లు నటించిన చిత్రాలు “వాల్తేరు వీరయ్య” మరియు “వీరసింహా రెడ్డి” సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.

మరి ఫైనల్ గా ఈ చిత్రాలకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కోరుకుంటున్న టికెట్ ధరల హైక్స్ వస్తాయా లేదా అనేది లేటెస్ట్ గా రివీల్ అయ్యిపోయింది. మరి రెండు సినిమాల యూనిట్స్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి రిక్వెస్ట్ పెట్టుకోగా రెండు సినిమాలకి స్వల్ప హైక్స్ లభించాయి.

తెలంగాణాలో ఆరవ షో కి పర్మిషన్ ఇవ్వగా మరి ఏపీలో అయితే వాల్తేరు వీరయ్య చిత్రానికి 25 రూపాయలు పెంచుకోవచ్చని చెప్పగా బాలయ్య సినిమాకి మాత్రం కేవలం 20 రూపాయల హైక్ మాత్రమే ఇవ్వడం చర్చకు దారి తీసింది. రెండు సినిమాల్లో మళ్ళీ 5 రూపాయలు తేడా ఏంటా అని అంతా మాట్లాడుకుంటున్నారు.

దీనితో ఈ రకంగా బాలయ్య సినిమా 5 రూపాయలు ఒకో టికెట్ మీద లాస్ అవ్వాల్సి వచ్చింది అని ట్రేడ్ వర్గాలు వారు అంటున్నారు. మరి దీనికి కారణం అయితే సినిమాలో ఉన్న ఓ డైలాగ్ వల్లనే అని కూడా అనని వారు లేకపోలేరు.