వైరల్ : పోస్టర్స్ తో చిరుని కెలుకుతున్న బాలయ్య.!

తెలుగు చలన సినిమా దిగ్గజ హీరోలు మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ లు ఇద్దరూ కూడా ఇప్పుడు తమ రేంజ్ హిట్స్ తో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నారు. కాగా ఈ సినిమాల్లో అయితే ఈ ఏడాది వచ్చిన “వాల్తేరు వీరయ్య”, “వీరసింహా రెడ్డి” సినిమాలు ఇద్దరి కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచాయి.

అయితే వాల్తేరు వీరయ్య గ్రాస్ పరంగా కాకుండా భారీ లాభాలు ఇచ్చిన సినిమాగా నిలిచింది. కానీ వీరసింహ రెడ్డి మాత్రం స్వల్ప నష్టాల్లోనే మిగిలింది. మరి అంత పోటీలో వచ్చిన ఈ రెండు సినిమాలుతో అభిమానుల్లో గొడవలు కూడా సర్వ సాధారణం. అయితే ఫైనల్ గా విన్నర్ గా మెగాస్టార్ సినిమానే నిలవగా..

లేటెస్ట్ గా 100 రోజులు రన్ ని అయితే వీరసింహా రెడ్డి కంప్లీట్ చేసుకోవడం అలాగే దీనిపై ఓ పోస్టర్ ఇపుడు కాంట్రవర్సీగా మారింది. ఇందులో బాలయ్య సింగిల్ హ్యాండ్ గా 100 కోట్లు కొట్టాడు అంటూ చిరు కి సెటైర్ వేయడం మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదు.

వాల్తేరు వీరయ్య లో చిరు తో పాటుగా రవితేజ లాంటి స్టార్ కూడా ఉన్నాడు కాబట్టే ఆ సినిమాకి అంత వసూళ్లు వచ్చాయి అని లేకపోతే వాల్తేరు వీరయ్య కి అంత సీన్ లేదు అన్నట్టుగా సెటైర్ వేశారు. దీనితో కామ్ గా ఉండే మెగాస్టార్ ని ఇలా కెలుక్కోవడం అవసరమా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా రెండు సినిమాలని నిర్మాణం వహించిన మైత్రి మూవీ మేకర్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.