“భగవంత్ కేసరి” నష్టాలు బాలయ్య ముందే ఊహించాడా??

టాలీవుడ్ సినిమాకి మాస్ గాడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ భారీ చిత్రం “భగవంత్ కేసరి” ఈ దసరా కానుకగా అయితే రిలీజ్ చేసి మంచి హిట్ కొట్టినట్టుగా చిత్ర యూనిట్ ట్రేడ్ వర్గాలు కూడా డప్పు కొడుతున్నారు. ఐతే రియాలిటీ విషయానికి వస్తే రెండో రోజు నుంచే భగవంత్ కేసరికి డ్రాప్ లు నమోదు అయ్యాయి అని టాక్ వచ్చేసింది.

కానీ దానిని చాలా వరకు కవర్ చేస్తూ వసూళ్లు బాగానే ఉన్నాయని ఆల్ మోస్ట్ మేకర్స్ తేల్చేసారు. అయితే మరీ దారుణంగా లేవు ఓకే పర్వాలేదు అనిపించే రేంజ్ లో భగవంత్ కి నెక్స్ట్ డే నుంచి వసూళ్లు వచ్చాయి. కానీ సినిమాకి మాత్రం నష్టాలు తప్పవని ఓ టాక్ అయితే ట్రేడ్ సర్కిల్స్ లో మాత్రం ఉంది.

కాగా ఈ సినిమాకి నష్టాలు వస్తాయని బాలయ్యకి ముందే తెలుసా అంటే తెలుసనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో బాలయ్య చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. భగవంత్ కేసరి కి డబ్బులు పోతే పోనీ ఏం పర్వాలేదు కానీ ఒక మంచి సినిమా అందించాం అనే మాట మాత్రం మిగులుతుంది అని బాలయ్య చెప్పేసారు.

అంటే భగవంత్ కేసరికి అనౌన్స్ చేసిన అఫీషియల్ వసూళ్లు అన్నీ ఫేక్ అని ఒప్పుకున్నట్టేనా అనేది ఇపుడు అందరిలో చర్చగా మారింది. అయితే అఫీషయల్ గా ఈ చిత్రం సేఫ్ అవ్వాలి అంటే ఇంకా 10 కోట్లు షేర్ రాబట్టాల్సి ఉంది. మరి అన్ అఫీషియల్ గా అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది అని భోగట్టా.