ఆదిత్య 369 సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ… త్వరలోనే సెట్స్ పైకి సీక్వెల్ చిత్రం!

నందమూరి బాలకృష్ణ సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఆదిత్య 369. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది.ఇలా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం తప్పనిసరిగా వస్తుందని ఎన్నోసార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సైతం సీక్వెల్ గురించి గతంలో ఎన్నో సార్లు వెల్లడించారు.

ఇకపోతే ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ చిత్రంగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా వస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు సంగీతం శ్రీనివాస్ కూడా పని చేయడంతో ఈ ఊహగానాలకు మరింత బలం చేకూరింది.ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీతం శ్రీనివాస్ ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. తాను ప్రాజెక్టుకే సినిమా కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే అయితే స్క్రిప్ట్ లో కేవలం కొన్ని సజెషన్స్ మాత్రమే తాను ఇచ్చానని అదేవిధంగా ఈ సినిమా ఆదిత్య 369 కు సీక్వెల్ చిత్రం కాదని ఈయన క్లారిటీ ఇచ్చారు.

ఇక బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా బాలయ్య ఆదిత్య369 సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని అయితే సీక్రెట్ చిత్రాన్ని ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ తో తెరకెక్కించబోతున్నట్లు పేర్కొన్నారు.ఇక గతంలో ఆదిత్య 36 సీక్వల్ చిత్రం ద్వారా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీకి లాంచ్ కాబోతున్నారంటూ పెద్ద ఇద్దరు వార్తలు వచ్చాయి. అయితే త్వరలోనే ఈ విషయం గురించి కూడా క్లారిటీ రానుంది.