బాలకృష్ణ ఆ స్క్రిప్ట్ చదివి ఫుల్ ఎక్సైట్.. మరొక నరసింహనాయుడు గ్యారెంటీ ?

బాలకృష్ణ బోయపాటి శ్రీను ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమా తెరకెక్కున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ – పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మధ్య బాలయ్యకి వరసగా ఫ్లాప్స్ రావడం తో ఈ సినిమా గురించి నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను బాలయ్యతో సింహ, లెజెండ్ తీసి భారీ కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు బాలయ్య – బోయపాటి ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొడతారని అందరు ఎంతో నమ్మకంగా ఉన్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ఇప్పటికే దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించాడు. పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న బాలయ్య – బోయపాటి కాంబోని మే 28 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు కూడా. కాగా ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయో నెక్స్ట్ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాలలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందరు బాలయ్య నెక్స్ట్ సినిమా పూరి జగన్నాధ్ తో ఉండబోతుందని అనుకున్నారు.

కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్న మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండబోతుందని మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పక్క కమర్షియల్ సినిమాగా బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ని ఫిక్స్ చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ బాలయ్య సినిమా స్క్రిప్ట్ పనులలో ఉన్నట్లు వారు తెలిపారు. ఏప్రిల్ వరకు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అవుతుందని.. బాలయ్య బిబి3 రిలీజ్ కాగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందని వెల్లడించారు. ఇక ఇన్‌సైడ్ టాక్ ప్రకారం బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన నరసింహ నాయుడు తరహాలో ఉంటుందని తెలుస్తోంది.