మళ్ళీ బాలయ్య డబుల్ భోనంజా

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీరసింహారెడ్డితో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అఖండ తర్వాత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ మాస్ కథాంశం ఇష్టపడే వారికి భాగా కనెక్ట్ అయ్యింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి మూవీని బాలయ్య చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కాజోల్ బాలయ్యకి జోడీగా నటిస్తోంది. అలాగే శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం కూడా అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కనుంది. దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.

భగవంత్ కేసరి మూవీ రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ ని ఈ సినిమాలో కూడా రిపీట్ చేయబోతున్నారంట. బాలయ్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలలో చాలా వరకు డ్యూయల్ రోల్ చేసినవి ఉంటాయి. ఆయన ఇమేజ్ పెంచిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు.

ఇప్పుడు బేబీ సినిమా కోసం అలాగే రెండు భిన్నమైన నేపథ్యాలలో పాత్రలని బాబి డిజైన్ చేసారంట. అందులో ఒకటి పొలిటికల్ లీడర్ గా ఉంటుందని తెలుస్తోంది. మరో పాత్ర ఫ్యాక్షనిస్ట్ గా ఉంటుందంట. ఈ రెండు పాత్రలకి మధ్య రిలేషన్ కూడా బిల్డ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. ఇక ఈ పాత్రల కోసం ఇద్దరు హీరోయిన్స్ ని ఎంపిక చేయనున్నారంట.

ప్రస్తుతం ఆ పనిలో కూడా బాబు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. వాల్తేర్ వీరయ్యతో సూపర్ సక్సెస్ అందుకున్న బాబి అంతకుమించి హిట్ ని బాలయ్య చిత్రంతో సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.