బాక్సాఫీస్ : వసూళ్లతో 4 రోజుల్లో దుమ్ము లేపిన “బేబీ”.!

ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ హిట్ అయ్యినటువంటి చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “బేబీ” అని చెప్పాలి. ముఖ్యంగా యూత్ ని ఎంతో అట్రాక్ట్ చేస్తున్న భారీ ఆదరణ అందుకున్న ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో సహా యూఎస్ లో కూడా మొదటి రోజు కంటే ఆ తర్వాత రోజు వసూళ్లు ఎక్కువే వచ్చాయి తప్పితే తక్కువ వచ్చింది లేదు.

కాగా ఇపుడు నాలుగో రోజు అది కూడా వర్కింగ్ డే అయ్యిన సోమవారం ఈ చిత్రం ఊహించని లెవెల్లో మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లు అందుకుంది అని చిత్ర యూనిట్ చెప్తున్నారు. దీనితో ఈ చిత్రం మొత్తం నాలుగు రోజుల్లో 31 కోట్ల భారీ గ్రాస్ ని అందుకుంది. దీనితో డే 3 అయితే ఈ చిత్రం మొత్తం 23 కోట్లకి పైగా వసూళ్లు అందుకోగా.

నాలుగో రోజు కూడా 8 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి 31 కోట్ల గ్రాస్ కి చేరుకుంది. అయితే రిలీజ్ అయ్యిన శుక్రవారం సహా ముందు రోజు ప్రీమియర్స్ కి కలిపితేనే కానీ 7 కోట్లకి పైగా ఈ సినిమాకి వసూళ్లు రాలేదు కానీ అలాంటిది వర్కింగ్ డే సోమవారం రిలీజ్ డేట్ కన్నా ఎక్కువ రాబట్టడం అనేది షాకింగ్ అని చెప్పాలి.

దీనితో చిత్ర దర్శకుడు సాయి రాజేష్ అలాగే నిర్మాత ఎస్ కె ఎన్ కూడా తెలుగు ప్రేక్షకులుకి పెద్ద థాంక్స్ ని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ లు మేల్ లీడ్ లో నటించగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. మరి ఈ రేంజ్ పెర్ఫామెన్స్ తో అయితే ఈ సినిమా 50 కోట్ల మార్క్ కంటే ఎక్కువ వసూళ్లు కొల్లగొట్టిన ఆశ్చర్యం లేదని చెప్పి తీరాలి. 
https://twitter.com/sairazesh/status/1681193676033368065