ట్రోల్స్ పై ఎమోషనల్ రిప్లై ఇచ్చిన “బేబీ” నిర్మాత.!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర హిట్ సినిమాగా వినిపిస్తున్న పేరు “బేబీ”. మరి యువ నటీనటులతో వచ్చిన ఈ యూత్ డ్రామాని అయితే దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా పట్ల ఈ సినిమా అందుకుంటున్న రెస్పాన్స్ విషయంలో అయితే మేకర్స్ ఇపుడు చాలా ఎమోషనల్ గా ఉన్నారు.

ఓ పక్క నటీనటులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలు ఇద్దరు కూడా తమపై ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్ కి ఆనందం వ్యక్తం చేస్తుండగా సినిమా దర్శకుడు సాయి రాజేష్ అలాగే నిర్మాత ఎస్ కె ఎన్ లు అయితే ఈ స్పందనతో ఒకింత బాగా ఎమోషనల్ అవుతున్నారు.

అయితే నిర్మాత ఎస్ కె ఎన్ రీసెంట్ గా సినిమా మీడియా ఇంటరాక్షన్ లో బాగా భావోద్వేగానికి లోను కావడం సోషల్ మీడియాలో వైరల్ కాగా తాను నిర్మాణం వహించిన ఈ సినిమాపై ఈ వీడియోపై కొందరు నెటిజన్స్ అయితే ట్రోల్స్ స్టార్ట్ చేశారు. వీళ్ళు తీసిన సినిమాని బాహుబలి, హాలీవుడ్ చిత్రం ఇంటర్ స్టెల్లార్ లా ఫీల్ అయిపోతున్నారు అని కామెంట్స్ చేస్తుండగా వీటిపై నిర్మాత స్పందించాడు.

జస్ట్ 2700 జీతంతో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాలు నిర్మించే స్థాయికి నేను సోలోగా వచ్చాను అని సో నాకు ఈ సినిమా విజయం ఆ ఇంటర్ స్టెల్లార్ సినిమా కంటే పెద్దదే అలాగే కొత్త వాళ్ళతో సినిమా చేసి ఆ సినిమా 7 కోట్లు మొదటి రోజు రాబడితే అది కూడా ఇంటర్ స్టెల్లార్ కంటే పెద్ద అచీవ్మెంటే నాకు బస్..

నేనెప్పుడూ ఒకరికి సాయమే చేశా నేను కష్టపడతాను ఆ కష్టానికి వచ్చిన ఫలితంతో ఎంజాయ్ చేస్తాను దయచేసి అంతా అర్ధం చేసికోండి అని తాను సమాధానం ఇచ్చాడు. దీనితో తనకి మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.