విరాట్ బుగ్గ‌పై ముద్దు పెట్టిన అనుష్క‌.. అవాక్క‌యిన ప్రియాంక చోప్రా

బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క‌శ‌ర్మ ఒక‌రు. 2017 డిసెంబర్‌లో ఇటలీలోని టుస్కానీలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఒక్కటయ్యారు. వచ్చే ఏడాది జనవరి ముగిసేలోగా తాము ముగ్గురం కాబోతున్నామంటూ అనుష్కతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఆగ‌స్ట్‌లో గుడ్ న్యూస్ చెప్పాడు విరాట్ కోహ్లీ. ప్ర‌స్తుతం ఈ జంట ఐపీఎల్ సీజన్ 13లో భాగంగా దుబాయ్‌లో ఉంది. బ‌యో బ‌బుల్ కార‌ణంగా హోట‌ల్ రూంకే ప‌రిమిత‌మైన ఈ జంట ఆనంద‌క్ష‌ణాలను గ‌డుపుతున్నారు.

న‌వంబ‌ర్ 5న భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్, అనుష్క శ‌ర్మ విరాట్ కోహ్లీ 32వ బ‌ర్త్‌డే కాగా, ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ను ఆర్సీబీ రాయల్ ఛాలెంజ‌ర్స్ టీం ఘ‌నంగా జ‌రిపింది. అనుష్క స‌మ‌క్షంలో విరాట్‌తో కేక్ క‌ట్ చేయించి ఆయ‌న‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు. కేక్ క‌టింగ్ త‌ర్వాత ఒక‌రి ముఖాల‌కు ఒక‌రు కేకులు పూసుకొని ర‌చ్చ‌చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే అనుష్క శ‌ర్మ తన భ‌ర్త బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పెట్టిన ఫోటో నెటిజ‌న్స్‌ని ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది.

త‌న భ‌ర్త విరాట్ కోహ్లీని ప్రేమ‌గా హ‌త్తుకున్న ఫోటోతో పాటు బుగ్గ‌పై కిస్ ఇచ్చిన ఫోటోల‌ని అనుష్క‌శ‌ర్మ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలు అంత‌ర్జాలంలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌ని సైతం ఈ పోస్ట్ ఆక‌ట్టుకుంది. ప్రియాంక చోప్రా, సోనాలి బింద్రే, మౌని రాయ్, త‌హిరా క‌శ్య‌ప్ త‌దిత‌ర సెల‌బ్రిటీలు అనుష్క పోస్ట్‌కు ఎమోజీల‌తో త‌మ‌దైన శైలిలో స్పందించారు. కాగా, ఐపీఎల్ త‌ర్వాత విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ వెళ్ళ‌నున్నాడు. ఈ టూర్‌కి త‌న భార్య‌ని కూడా తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది.