డైరెక్టర్ రాజమౌళి కాళ్లపై పడిన అనుపమ పరమేశ్వరన్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారాప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదటి షో తోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఈ క్రమంలోనే ఈ సినిమా విజయపతంలో దూసుకుపోతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను థియేటర్ కి వెళ్లి వీక్షిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో చిత్ర బృందం ఐమాక్స్ లో ఈ సినిమాని వీక్షించారు.ఈ క్రమంలోనే అదే థియేటర్ కు ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.

రాజమౌళి తనకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఎంతో ఇష్టమని ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా చూడటం కోసం ఈయన ఏకంగా తన కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లారు.ఇలా థియేటర్ కి వెళ్లిన అనంతరం సినిమా పూర్తి అవ్వగానే బయటకు వచ్చారు. కారు పార్కింగ్ వద్ద అనుపమ పరమేశ్వరన్ రాజమౌళిని చూడగానే వెంటనే ఆమె అక్కడికి వెళ్లి ఒకసారిగా ఆయన కాళ్లపై పడి ఆయన ఆశీర్వాదాలు తీసుకుంది. ఇలా రాజమౌళి కాళ్లకు అనుపమ నమస్కరించడంతో ఆయన ఆశీర్వదించడమే కాకుండా సినిమా గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ముఖ్యంగా తన నటన కూడా చాలా అద్భుతంగా ఉందని తనపై ప్రశంసలు కురిపించినట్లు అనుపమ పరమేశ్వరన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.ఇకపోతే ఎం ఎం కీరవాణి కూడా అక్కడే ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా ఈమె పరామర్శించినట్లు వెల్లడించారు.ఇకపోతే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.