టిల్లు స్క్వేర్.! తలనొప్పి కూడా అదే స్థాయిలో.!

‘డీజే టిల్లు’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో నిర్మాణ సంస్థకి కాసుల కనక వర్షం కురిపించనడం అతిశయోక్తి కాదేమో. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కినా, అత్యద్భుతమైన వసూళ్ళను సాధించేసింది ‘డీజే టిల్లు’. దాంతో, ఆ సినిమా సీక్వెల్ అయిన ‘టిల్ల స్క్వేర్’ మీద అంచనాలు పెరిగిపోయాయ్. బడ్జెట్ కూడా అనూహ్యంగా పెరిగిపోయింది.

ఓ మోస్తరు భారీ బడ్జెట్ సినిమాగానే దీన్ని ఇప్పుడంతా చూస్తున్నారు. కాగా, హీరోయిన్ విషయమై కిందా మీదా పడ్డారు.. చివరికి అనుపమ పరమేశ్వరన్ ఖరారయ్యింది. వాస్తవానికి ఓ సారి అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి వాకౌంట్ చేసి, రీ-ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందట.

ఇదిలా వుంటే, దర్శకుడికీ హీరోకీ అస్సలు పొసగడంలేదనే గాసిప్స్ నిర్మాతని ఇరుకున పడేస్తున్నాయి. ‘ఆల్ ఈజ్ వెల్’ అని నిర్మాత నాగవంశీ చెబుతున్నా, ‘టిల్లుగాని’ తలనొప్పి కూడా ‘స్క్వేర్’ సైజ్.. అంతకు మించి వుందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం.