బేబీ అభిమానులకి మరో మరో సర్ ప్రైజ్

సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ టాక్ తో రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 50 కోట్లు దాటిపోయి వంద కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు పెడుతోంది. ప్రతి రోజు థియేటర్స్ లో కోటి రూపాయిల వరకు కలెక్ట్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ బ్రో మూవీ రిలీజ్ కావడంతో చాలా థియేటర్స్ లో బేబీ సినిమాని తొలగించారు.

అయితే బేబీ మూవీ ద్వారా వంద కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో అదనంగా కొన్ని సన్నివేశాలు జోడించాలని అనుకుంటున్నారంట. ముఖ్యంగా 14 నిమిషాల నిడివి ఉన్న సీన్స్ ని డిఫరెంట్ ప్లేస్ లలో జోడించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ సీన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని భావించి సాయి రాజేష్ అలా ప్లాన్ చేస్తున్నారంట. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆనంద్ దేవరకొండకి కూడా కెరియర్ బిగ్గెస్ట్ హిట్ వచ్చింది. దర్శకుడు సాయి రాజేష్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా అవకాశాలు విపరీతంగా వస్తున్నాయంట.

బ్రో మూవీకి ఏవరేజ్ టాక్ రావడంతో వీకెండ్ తర్వాత ఆడియన్స్ తగ్గే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో బ్రో మూవీ ఆడుతున్న థియేటర్స్ లో బేబీని మళ్ళీ ప్రదర్శించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక వేళ ఈ అదనపు సన్నివేశాలు యాడ్ చేసిన విషయం యూత్ లోకి వెళ్తే మాత్రం కచ్చితంగా మళ్ళీ థియేటర్స్ కి క్యూకట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

మరి చిత్ర యూనిట్ ఎంచుకున్న ఈ స్ట్రాటజీతో వంద కోట్ల టార్గెట్ ని ఈ చిన్న చిత్రంతో అందుకునే అవకాశం ఉందేమో చూడాలి. ఒక వేళ వందకోట్ల మార్క్ టచ్ చేస్తే మాత్రం టాలీవుడ్ లో అదొక రికార్డుగా నిలిచిపోయే అవకాశం ఉంది.