బాలయ్య బాటలో చిరంజీవి.?

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా రీమేక్ సినిమాలకే చిరంజీవి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ‘వాల్తేర్ వీరయ్య’ స్ర్టెయిట్ మూవీనే అయినప్పటికీ కమర్షియల్ మూవీ లిస్టులోకి చేరుతుంది.

అయితే, ఇకపై చిరంజీవి, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా సీరియస్ మూవీ ఒకటి చేయబోతున్నారనీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.

చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన వి.వి.వినాయక్ పేరు ఈ ప్రాజెక్ట్ కోసం పరిశీలనలో వుందట. పూర్తి స్థాయి సీరియస్ టోన్‌లో ఈ సినిమా సాగుతుందట. కామెడీకి అస్సలు స్కోప్ వుండదనీ తెలుస్తోంది.

ఓ సీనియర్ హీరోయిన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోందనీ తెలుస్తోంది. అయితే ఎవరా సీనియర్ హీరోయిన్ అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిజల్ట్‌ని బట్టి ఈ నయా ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలా.? వద్దా.? అని చిరు ఆలోచన చేస్తారట.

‘భోళా శంకర్’ రిజల్ట్ బట్టే, వెంటనే ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తారా.? లేక మధ్యలో ఇంకో సినిమా ఏమైనా చేస్తారా.? అనేది డిసైడ్ చేస్తారట. అన్నట్లు సొంత బ్యానర్‌లోనే ఈ సినిమా వుండబోతోందట.