మరో విషాదం : తెలుగు సినిమా స్టార్ ఎడిటర్ కన్నుమూత.!

అదేంటో కానీ మన తెలుగు సినిమా దగ్గర ఒక విషాదం నెలకొంటే కొన్ని రోజులు వారాల వ్యవధిలోనే మళ్ళీ మరో విషాద వార్త వినక తప్పడం లేదు. నిన్ననే తెలుగు సినిమా విప్లవ సినిమాల నటుడు ఆర్ నారాయణ మూర్తికి మాతృ వియోగం జరగగా ఆ వార్త ఇంకా మర్చిపోకుండానే ఇప్పుడు మరో షాకింగ్ మరియు విషాద వార్త బయటకి వచ్చి టాలీవుడ్ ని దిగ్భ్రాంతికి లోను చేసింది.

ఇక వివరాల్లోకి వెళితే మన టాలీవుడ్ సినిమాకి చెందిన ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు ఈరోజు తెల్లవారున కన్ను మూసినట్టుగా తెలిసింది. గత కొంత కాలం నుంచి ఆయన కిడ్నీ సంబంధింత సమస్యతో ఇబ్బంది పడుతుండగా చికిత్స పొందుతున్నా కూడా ఎలాంటి లాభం లేకపోయింది.

దీనితో హైదరాబాద్, మోతీనగర్ లో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తన 68వ ఏట తుది శ్వాస విడిచారు. చట్టానికి కళ్ళు లేవు సినిమాతో మొదలైన తన సినీ ప్రస్థానం చివరగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ హిట్ “సరిలేరు నీకెవ్వరు” తో ముగిసింది.

మధ్యలో మెగాస్టార్, బాలయ్య, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా ఎందరో స్టార్ నటులతో సినిమాలు చేసి 800కి పైగా సేవలు అందించారు. దీనితో ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొనగా సినీ ప్రముఖులు గౌతమ్ రాజు మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.