బాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌… కరణ్‌,రణ్‌వీర్‌, షారూఖ్‌లతో చిత్రం!

బాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌ తెరపైకి రానుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్‌ విూడియాను షేక్‌ చేస్తున్నది. అదీ కూడా 13 ఏండ్ల తర్వాత ఈ కలయిక జరగనుండడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై పడింది. ఇంతకు విషయానికి వస్తే బాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ షారుఖ్‌ఖాన్‌, రణవీర్‌ సింగ్‌ కాంబినేషన్‌లో ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ రూపొందనున్నట్లు, త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు బాలీవుడ్‌ విూడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

1995లో ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’ వంటి ఆల్‌టైమ్‌ హిట్‌ సినిమాతో ప్రారంభమైన కరణ్‌, షారుఖ్‌ కాంబినేషన్‌ 2010లో వచ్చిన ‘మై నేమ్‌ ఇస్‌ ఖాన్‌’ వరకు నిర్మాతలుగా, గెస్ట్‌ అప్పియరెన్స్‌, ప్రత్యేక పాత్రలు, కెమియోలు ఇలా మొత్తంగా 22 సినిమాలకు కలిసి పని చేశారు. అయితే వీటిలో అన్నీ ఫ్యామిలీ చిత్రాలు కావడమే కాక విజయాల శాతం కూడా ఎక్కువే.

ఇటీవలే రణ్‌వీర్‌ సింగ్‌ అలియా భట్‌లతో ‘రాఖీ ఔర్‌ రాణి కా ప్రేమ్‌ కహానీ’ సినిమాతో హిట్‌ కొట్టిన కరణ్‌ ఇప్పుడు ఈ చిత్రంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం కరణ్‌ జోహర్‌ , షారుఖ్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రం వారి గత చిత్రాలకు భిన్నంగా ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌తో మునుపెన్నడు సిల్వర్‌ స్కీన్ర్‌పై రాని విధంగా తీయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంవత్సరం పఠాన్‌, జవాన్‌ వంటి యాక్షన్‌ సినిమాలతో మంచి ఊపు విూదున్న షారుఖ్‌తో మరోసారి అలాంటి తరహా చిత్రమే తీయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా ఇప్పటివరకు 10 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన కరణ్‌ జోహర్‌ అందులో యాక్షన్‌ జానర్‌లో ఒక సినిమా కూడా చేయకపోవడం విశేషం. ఈ క్రమంలో ప్రస్తుతం అంతటా యాక్షన్‌ చిత్రాల ట్రెండ్‌ నడుస్తుండడంతో కరణ్‌ కూడా ఆ వైపు టర్న్‌ తీసుకోని తనకు అచ్చొచ్చిన షారుఖ్‌ ఖాన్‌తో ఫుల్‌ లెంగ్త్‌ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాను తెరవిూదకు తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో మరో బాలీవుడ్‌ స్టార్‌ రణవీర్‌ సింగ్‌ నటించనున్నట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి.