ఆ ఇద్దరు హీరోలని ఇబ్బంది పెడుతున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ యాక్షన్ జోనర్ లో ఈ సినిమాని అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ నడుస్తుంది. కాజల్ అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా మరో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రీసెంట్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ లుక్ లో బాలయ్య డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు గా టాక్ వినిపిస్తుంది.ఇంకా అఫీషియల్ గా అయితే ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే అదే డేట్ కి రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాని ఇప్పటికే ఎనౌన్స్ చేసేశారు. అలాగే రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీని కూడా అక్టోబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ కాబోతుంది. ఈ అయితే బాలకృష్ణ ఇప్పుడు అదే డేట్ ని రిలీజ్ చేస్తే మాత్రం కచ్చితంగా ఈ ఇద్దరు హీరోలకి ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పాలి. ఫ్యాన్ బేస్ పరంగా చూసుకుంటే బాలకృష్ణకి ఎక్కువగా ఉంటుంది.

ఆయన చేసేది పాన్ ఇండియా మూవీ కాకుండా కచ్చితంగా రవితేజ, రామ్ పోతినేని సినిమాలకి మాత్రం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటూ ఉంటుంది. పాన్ ఇండియా మూవీస్ కావడంతో ఓపెనింగ్స్ అయితే ఈ రెండు సినిమాలకి కీలకం అని చెప్పాలి.

మరి ఇలాంటి టైమ్ లో బాలకృష్ణ పోటీలో ఉంటే కచ్చితంగా రామ్, రవితేజలలో ఎవరూ ఒకరు తగ్గాల్సిందే. అసలే పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న ఈ ఇద్దరు స్టార్స్ కి సరైన ఓపెనింగ్స్ పడకపోతే లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ రాబట్టడం కష్టం అవుతుంది. ఈ నేపధ్యంలో ఎవరో ఒకరు తగ్గే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.