అనిల్ రావిపూడి ఇచ్చాడు గా భారీ ట్విస్ట్ – ఎఫ్3 లోకి ఎవరు వస్తున్నారో తెలుసా ?

అనిల్ రావిపూడి ఎఫ్2 సినిమాతో కెరీర్ లోనే భారీ సక్సస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం గొప్ప విషయం. నిర్మాత దిల్ రాజు కి ఎఫ్ 2 భారీ కమర్షియల్ హిట్ ని ఇచ్చింది. ఎఫ్ 2 సినిమా అందుకున్న భారీ సక్సెస్‌తో ఈ సినిమా సీక్వెల్ ని నిర్మించాలని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి అప్పుడే నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే ఇటీవల ఎఫ్3ని సెట్స్ మీదకి తీసుకు వచ్చారు.

ఇక ఈ సినిమా సీక్వెల్‌లో కూడా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌ తమన్నా, మెహ్రీన్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఎఫ్ 3 ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ రిలీజై సినిమా మీద అంచనాలు పెంచాయి. కాగా ఈ సీక్వెల్ కథ డబ్బు నేపథ్యంలో సాగుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లో హింట్ ఇచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అంతేకాదు ఈ సినిమా కన్ఫ్యూజన్ కథతో సాగుతుందని, అందులో నుంచి పుట్టుకొచ్చే కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు.

కాగా ఈ సినిమాలో మూడవ క్యారెక్టర్ లో ఎవరు నటిస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇన్నాళ్ళు మాస్ మహారాజ రవితేజ నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. కాని తాజాగా మూడవ పాత్రలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్ర సినిమాలో మరింత కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేసి సినిమాను మరింత ఆసక్తికరంగా మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తాడని సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది మాత్రం మేకర్స్ నుంచి అఫీషియల్ గా కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది. నిజంగా గనక సాయి ధరమ్ తేజ్ నటిస్తే మాత్రం ఇద్దరు మెగా హీరోలని ఒకే సినిమాలో చూడటానికి మెగా ఫ్యాన్స్ కి రెండు కళ్ళు చాలవు.