ఏవండి అంటూ ప్రేమగా పిలిచింది.. భార్యభర్తలైన యాంకర్ ప్రదీప్-పూర్ణ!!

ఢీ షోలో జరిగే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఢీ షోలో డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం డ్యాన్సులతో పాటు కామెడీ స్కిట్స్, పంచ్‌లు, లవ్ ట్రాక్‌లు ఇలా అబ్బో వేరే లెక్కలన్నీ ఉన్నాయి. ఈ మధ్య ఢీ షోలో శేఖర్ మాస్టర్‌కు బదులుగా బాబా భాస్కర్ జడ్జ్‌గా వస్తున్నాడు. శేఖర్ మాస్టర్‌కు కరోనా సోకడంతో, గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందుకే బాబా మాస్టర్ జడ్జ్‌గా వచ్చి రచ్చ చేస్తోన్నాడు.

Anchor Pradeep And Poorna Skit In Dhee,Anchor Pradeep
Anchor Pradeep And Poorna Skit In Dhee,Anchor Pradeep

అయితే బాబా మాస్టర్ అటు ప్రియమణి, ఇటు పూర్ణలతో ఇద్దరితోనూ డ్యాన్సులు చేస్తూ స్టేజ్‌ను హీటెక్కించాడు. ప్రియమణితో చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్, పూర్ణతో చేసిన మాస్ పర్ఫామెన్స్ ఓ రేంజ్‌లో వర్కవుట్ అయింది. అయితే అంతకు ముందు ప్రదీప్ పూర్ణతో ఓ ట్రాక్ వేశారు. అందులో భాగంగా పూర్ణ కూడా ప్రదీప్ అంటే క్రష్అని చెప్పడం ఇద్దరూ కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయడంతో ఆ ఎపిసోడ్ దద్దరిల్లిపోయింది.

అలా బుల్లితెరపై పూర్ణ-ప్రదీప్ కొత్త ట్రాక్‌కు నాంది పడింది. తా

Anchor Pradeep And Poorna Skit In Dhee,Anchor Pradeep
Anchor Pradeep And Poorna Skit In Dhee,Anchor Pradeep

జాగా వీరిద్దరు ఢీ షోలో ఓ స్కిట్ వేశారు. అందులో ఏకంగా భార్యాభర్తలుగా నటించేశారు. ఏవండి అంటూ ప్రదీప్‌ను ప్రేమగా పిలుస్తూ… కాపీ తాగుతారా? ఏం వంట వండమంటారు? అంటూ పూర్ణ ఆ స్కిట్‌లో జీవించేసింది. ఇలా మొత్తానికి వీరిద్దరి మధ్య ఏదో ఒకటి నడుస్తుందని పరోక్షంగా ఇలాంటి స్కిట్స్ వేసి చెబుతున్నారో ఏమో గానీ ఈ ప్రోమో మాత్రం తెగ వైరల్ అవుతోంది.