Anchor Anasuya: మెగాస్టార్ ఆచార్య సినిమాపై అనసూయ ఆసక్తికరమైన ట్వీట్..!

Anchor Anasuya: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వయసులోనూ ఆయన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్న మెగాస్టార్, జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలు తీస్తూ, అప్పటి, ఇప్పటి తరం వారిని ఆకట్టుకుంటున్నారు. ఆయన చేసిన చిన్న సీన్ సైతం సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. అలాంటిది ఆయనే ఫుల్ లెన్త్ సినిమాలో నటిస్తే, ఆ క్రేజ్ ను తట్టుకోవడం ఆయన వల్ల కూడా కాదేమో.

ఇటీవలి కాలంలోనూ వరుస సినిమాలు చేస్తున్న చిరంజీవి, ఈ మధ్య కాలంలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రంలో నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. అంతే కాకుండా ఈ మూవీలో ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా కనువిందు చేయనుండడంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయ్యి, యూట్యూబ్ లో వ్యూస్ రూపంలో అభిమానం వెల్లడవుతోంది. దీంతో రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఆచార్య సినిమా కోసం సాధారణ ప్రేక్షకుడి నుంచి, ప్రముఖుల వరకు ఈ మూవీ విడుదల కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుల్లితెర యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. వావ్, మీరొచ్చారని చెప్పక్కర్లేదు సర్, మీరు చేస్తూ ఉండండి, మేము చూస్తూ ఉంటాం, ఎంత నిండుగా ఉందో, సినిమా చూడాలని ఎంతో ఆతృతగా ఉంది, సిద్దా, ఆచార్య అంటూ పులి, చిరుత పులితో కూడిన ఏమోజీలను షేర్ చేస్తూ తన అభిమానాన్ని వ్యక్తం చేసింది.