Anasuya : పుష్ప కాంబో మరోసారి రిపీట్…సునీల్ తో కలిసి నెగెటివ్ రోల్ లో అనసూయ…!

Anasuya: అనసూయ భరద్వాజ్ బుల్లితెర మీద యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది. బుల్లి తెర మీదనే కాదు అప్పుడప్పుడు వెండితెరపై నటిగా కూడా సందడి చేస్తోంది. రంగస్థలం శరణం పుష్ప వంటి సినిమాలలో అనసూయ నటన తో మంచి పేరు సంపాదించుకుంది. వరుస ఆఫర్లు క్యూ కడుతున్న తను మాత్రం తనకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రతో మంచి పేరు సంపాదించుకుంది.

సినిమా ఏదైనా తనకు పాత్ర నచ్చితే చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అది చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే. ఇటీవల వచ్చిన పుష్పం సినిమాలో దాక్షాయిని పాత్రతో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఈ సినిమాలో సునీల్ చేసిన మంగళం శీను క్యారెక్టర్ కు జోడీగా దాక్షాయిని పాత్ర లో అనసూయ నటించింది. ప్రస్తుతం అనసూయ నటిస్తున్న చిత్రం ‘దర్జా’. ఈ సినిమాలో కూడా అనసూయ సునీల్ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.ఈ మూవీకి సంబంధించిన టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ ను కనుక గమనిస్తే అనసూయ ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది.

కనక మహాలక్ష్మి అనే పాత్రలో అనసూయ కనిపిస్తుంది.ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే అనసూయకు పోలీస్ ఆఫీసర్ అయిన సునీల్ కు మధ్య జరిగే ఘర్షణే ఈ దర్జా అని టీజర్ తెలుపుతుంది. టీజర్ చూడ్డానికి పర్వాలేదు అనిపిస్తుంది.నేను చీర కట్టిన శివంగిని.. నేను వేటాడితే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి అంటూ అనసూయ చెప్పే డైలాగ్ బాగుంది. సలీమ్ మాలిక్ ఈ చిత్రానికి దర్శకుడు.