వెబ్‌ సీరిస్‌ ధూతలో నాగచైతన్య… ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీ!!

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా.. నాగార్జున కొడుకుగా నట వారసత్వాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు నాగచైతన్య. సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుంటూ యాక్టర్‌గా తనను తాను మరింత నిరూపించుకునేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉండే హీరోల్లో టాప్‌లో ఉంటాడు చైతూ. ప్రస్తుతం నాగచైతన్య చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు.

తాజాగా నాగచైతన్య నుంచి రెండు అప్‌డేట్స్‌ ఇప్పుడు అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తున్నాయి. అవేంటంటే విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో నటించిన వెబ్‌ ప్రాజెక్టు ధూత. ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ధూత తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబర్‌ 1న స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయాడు చైతూ. ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య ముంబైలో ల్యాండ్‌ అయ్యాడు. ఇవాళ ముంబైలో జరుగబోయే ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీఫైనల్ మ్యాచ్‌లో సందడి చేయనున్నాడు చైతూ. స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగులో కలుద్దాం.. అంటూ ఓ వీడియోను షేర్‌ చేశాడు నాగచైతన్య .

ముంబై ఎయిర్‌పోర్టులో నుంచి వస్తున్న విజువల్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. హార్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌లో పార్వతి తిరువొత్తు, ప్రియా భవానీ శంకర్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్నారు. ఫిషర్‌మెన్‌ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న దీనిని పాపులర్‌ బ్యానర్‌ గీతాఆర్ట్స్‌పై తెరకెక్కిస్తోంది.